ప్రకటన
స్థానిక సంస్థలలో రిజర్వేషన్లపై బహిరంగ విచారణ – అభిప్రాయ సేకరణ
తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని స్థానిక సంస్థల వద్ద వెనుకబాటుతనం స్వభావం మరియు ప్రభావాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, రిజర్వేషన్ల ప్రామాణికాన్ని నిర్ణయించడానికి కమీషన్ ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలో, ఖమ్మం జిల్లాలో బహిరంగ విచారణ చేపట్టాలని నిర్ణయించబడింది.
తేదీ: 19-11-2024
స్థానం: సమీకృత జిల్లా కార్యాలయల సముదాయం, ఖమ్మం
సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 వరకు
గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, లోకసభ మరియు రాజ్యసభ సభ్యులు, బి.సి మరియు సంచార జాతుల కుల పెద్దలు, ఇతర ప్రతినిధులు ఈ విచారణలో పాల్గొనవచ్చు. అభ్యర్థితులైన ప్రతివిధి అభిప్రాయాలను, నమూనా వెరిఫికేషన్ అఫిడవిట్తో కూడిన (06) ప్రతులలో తెలుగు లేదా ఆంగ్ల భాషలో సమర్పించవచ్చు.
సూచించినది:
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా న్యాయాధికారి,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
//అనుమతితో//
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
