రేగుల గండి చెరువును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక

మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని రేగుల గండి చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి జిల్లా అధికారుల పర్యవేక్షణలో ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ ప్రదేశాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చెరువులో సైకిలింగ్ బోట్లు, తెడ్డు సహాయంతో నడిచే బోట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. చెరువు మధ్య గుట్టల ప్రాంతాలలో నీటిమీద బోట్ రైడ్‌ను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మణుగూరు మండలం చినరావిగూడెం నుండి పర్ణశాల వరకు బోటు ప్రయాణ సౌకర్యం కల్పించి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మణుగూరు తహసీల్దార్ రాఘవ రెడ్డి, MPDO శ్రీనివాసరావు, మునిసిపల్ కమిషనర్ యాదగిరి, MPO వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అధికారుల పర్యవేక్షణలో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం త్వరలోనే పర్యాటకుల ఆకర్షణగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. రేగుల గండి చెరువు అభివృద్ధితో మణుగూరు ప్రాంతం పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానాన్ని సాధించేందుకు వీలవుతుందని అధికారులు నమ్మకంగా తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *